Ayodhya: అయోధ్యకు రానున్న ఎలాన్‌ మస్క్‌ తండ్రి

Ayodhya: అయోధ్యకు రానున్న ఎలాన్‌ మస్క్‌ తండ్రి

Play all audios:

Loading...

భారత్‌లో పర్యటించనున్న ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరాల్‌ మస్క్‌.. అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)


తండ్రి ఎరాల్‌ మస్క్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిరాన్ని ఆయన సందర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా పలు బిజినెస్‌ సమావేశాల్లో


పాల్గొననున్న ఆయన.. సీనియర్‌ అధికారులతోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. హరియాణా కేంద్రంగా ఉన్న సోలార్‌ ఈవీ ఛార్జింగ్‌ తయారీ సంస్థ సెర్వోటెక్‌.. ఎరాల్ మస్క్‌ను తమ గ్లోబల్‌ అడ్వైజరీ బోర్డు


సభ్యుడిగా (మే 5న) నియమించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి 6వ తేదీ వరకు ఆయన ఇక్కడ పర్యటించనున్నారు. సంస్థ ఏర్పాటు చేసే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ క్రమంలోనే అయోధ్యలోని రామమందిరాన్ని


సందర్శించనున్నారు. * క్లాస్‌లు ఎగ్గొట్టినా.. వీసా రద్దు: విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్‌ భారత్‌ పర్యటనలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలు, వివిధ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులతో ఎరాల్‌


మస్క్‌ భేటీ కానున్నట్లు సమాచారం. గ్రీన్‌ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్‌ మౌలికసదుపాయాల ఎగుమతులపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటన అనంతరం జూన్‌ 6న ఎరాల్‌ మస్క్‌


దక్షిణాఫ్రికాకు వెళ్తారు.