
Rajasingh: పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు భారాసతో కలిసిపోతారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Play all audios:
Loading...
హైదరాబాద్: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్నారు. ‘‘పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు భారాసతో కలిసిపోతారు. భాజపా
అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే భాజపా నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో మా నేతల కుమ్మక్కుతోనే
పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో భాజపా ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలి. వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఇతర పార్టీల నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసు’’ అని రాజాసింగ్ తెలిపారు.
(Telangana News)