
Udhayanidhi stalin: ఈడీకే కాదు మోదీకి కూడా భయపడం: ఉదయనిధి స్టాలిన్
Play all audios:
Loading...
చెన్నై: ఈడీకే కాదు మోదీకి కూడా తాము భయపడబోమని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. పుదుకోట్టైలో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో
మాట్లాడుతూ.. నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారన్నారు. ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది
కాదన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇండోర్ స్టేడియం పూర్తి చేయడానికి రూ.3.5 కోట్ల నిధులు కేటాయించారన్నారు.