Rgukt 2025 admissions: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

Rgukt 2025 admissions: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

Play all audios:

Loading...

తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌


విడుదలైంది. By Features Desk Updated : 28 May 2025 18:33 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 2 min read ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక


విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వర్సిటీ ఉపకులపతి గోవర్దన్‌ ఈ


నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 31 నుంచి జూన్‌ 21వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.  జులై 4న ప్రొవిజినల్‌ ఎంపిక జాబితాను ప్రకటించి.. జులై 7న తొలి దశ కౌన్సెలింగ్‌


చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌ HTTPS://WWW.RGUKT.AC.IN/ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు


సాధించిన గ్రామీణ పేద విద్యార్థులు ఆర్జీయూకేటీ బాసర (1500 సీట్లు), మహబూబ్‌నగర్‌ (180 సీట్లు) సెంటర్లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ  పేద


విద్యార్థులకు  సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఆర్జీయూకేటీలను 2008లో ప్రారంభించినట్లు వీసీ గోవర్దన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రాఫెసర్ మురళీ దర్శన్, కన్వీనర్ డాక్టర్


చంద్రశేఖర్, కో కన్వీనర్ డాక్టర్ దేవరాజు, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్,  మంతపురి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. * ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు సాధించిన మార్కుల


ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి రెసిడెన్షియల్‌ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌


ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు.  * ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి


తీసుకుంటారు. తొలుత గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ


వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు ఎలా? * స్టెప్‌ 1: తొలుత ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌ నింపాలి. ఆ


తర్వాత అన్ని వివరాలతో దరఖాస్తు సబ్‌మిట్‌ చేశాక అప్లికేషన్‌ ఐడీ వస్తుంది.  * స్టెప్‌ 2: దరఖాస్తు ఫీజు చెల్లించాలి. * స్టెప్‌ 3: అప్లికేషన్‌ను ప్రింట్‌ తీసుకోవాలి. * స్టెప్‌ 4:


పీహెచ్‌/సీఏపీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులైతే తమ ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.  దరఖాస్తు రుసుం: ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీలకు రూ.450; ఇతర


రాష్ట్రాల అభ్యర్థులకైతే రూ.1500 * భర్తీకాని గ్లోబల్‌ కేటగిరీ సీట్ల కోసం తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రూ.1500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి.  * ఎన్నారై/ఇంటర్నేషనల్‌


అభ్యర్థులైతే 100 డాలర్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  * దరఖాస్తు రుసుం టీఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్లలో చెల్లించాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు ఎవరైనా చేస్తే.. లేటెస్ట్‌గా చేసిన వాటినే


 పరిగణిస్తారు. * దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను జూన్‌ 25లోగా స్పీడ్‌పోస్టు/రిజిస్టర్‌ పోస్టు ద్వారా (ది కన్వీనర్‌, యూజీ అడ్మిషన్స్‌ 2025-26, ఆర్జీయూకేటీ -బాసర, నిర్మల్‌ జిల్లా,


తెలంగాణ- 504107) పంపాలి. Published : 28 May 2025 18:09 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల


అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు


యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._