
Jee main: జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం.. కేంద్రాల వద్ద సందడి
Play all audios:
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. By Features Desk Updated : 22 Jan 2025 09:58 IST Ee Font
size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read ఎల్బీనగర్ అయాన్ డిజిటల్ కేంద్రం వద్ద.. ఇంటర్నెట్డెస్క్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు
రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9
నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల వెళ్లడంతో హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్లో ట్రాఫిక్కు
కాసేపు అంతరాయం కలిగింది. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరుగుతుంది.
దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు. Published : 22 Jan 2025 09:37 IST గమనిక: _ఈనాడు.నెట్లో
కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు
లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._