Jee advanced topper: ఆ పుస్తకాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టా: ‘అడ్వాన్స్‌డ్‌’ టాపర్‌ రజిత్‌ గుప్తా

Jee advanced topper: ఆ పుస్తకాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టా: ‘అడ్వాన్స్‌డ్‌’ టాపర్‌ రజిత్‌ గుప్తా

Play all audios:

Loading...

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాల్లో (JEE Advanced 2025


Results) రాజస్థాన్‌లోని కోటాకు చెందిన రజిత్‌ గుప్తా అదరగొట్టాడు. By Features Desk Updated : 02 Jun 2025 19:31 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 2 min read ఇంటర్నెట్


డెస్క్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాల్లో (JEE


Advanced 2025 Results) రాజస్థాన్‌లోని కోటాకు చెందిన రజిత్‌ గుప్తా అదరగొట్టాడు. 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. దేశ వ్యాప్తంగా మొత్తం 1,80,422 మంది


విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. 54,378మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 9404మంది బాలికలు ఉన్నట్లు ఐఐటీ కాన్పుర్ అధికారులు వెల్లడించారు. ఐఐటీ దిల్లీ జోన్‌ నుంచి రజిత్‌ గుప్తా 332/360 మార్కులతో


సత్తా చాటగా.. బాలికల విభాగంలో ఐఐటీ ఖరగ్‌పుర్‌ జోన్‌ నుంచి దేవదత్త మాఝీ 312/360 మార్కుతో జాతీయస్థాయిలో మెరిసింది.  ఈ పరీక్షను 116మంది విదేశీ విద్యార్థులు రాయగా.. వారిలో కేవలం 13మంది మాత్రమే


అర్హత సాధించారు. అయితే,  టాప్‌ 100 అభ్యర్థుల్లో బాంబే, దిల్లీ జోన్‌ల నుంచి 31మంది చొప్పున  ఉండగా.. ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ నుంచి 23మంది; కాన్పుర్‌ నుంచి నలుగురు,  ఖరగ్‌పుర్‌ నుంచి ఐదు, రూర్కీ


నుంచి ఆరుగురు చొప్పున టాపర్లు ఉన్నారు. ప్రిపరేషన్‌ ఎలా ఉండేదంటే..  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అపూర్వ విజయం సాధించడంపై రజిత్‌ గుప్తా ఆనందం వ్యక్తం చేశాడు. తన కృషివల్లే ఇదంతా సాధ్యమైందని ప్రముఖ


వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సందర్భంగా తన ప్రిపరేషన్‌, అనుసరించిన వ్యూహాలపై షేర్‌ చేసుకున్నాడు. మాక్ పేపర్లను విశ్లేషించడం, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపై ఎక్కువ దృష్టి


పెట్టడంతో పాటు ప్రిపరేషన్‌ సమయంలో తగినంత విరామం తీసుకోవడం ద్వారా ‘అడ్వాన్స్‌డ్‌’లో విజయం సాధించినట్లు తెలిపాడు.   ‘‘పదో తరగతిలో ఉన్నప్పట్నుంచే ప్రిపరేషన్‌ మొదలు పెట్టా. నా ప్రిపరేషన్‌లో


ఎలాంటి ప్రత్యేకత లేదు. కేటాయించుకున్న పనులను పూర్తి చేయడం, మాడ్యూల్‌లను సమయానికి పరిష్కరించడం నా ఏకైక లక్ష్యంగా ముందుకు సాగాను. హెచ్‌సీ వర్మ, ఇరోడోవ్‌ పుస్తకాల నుంచి ఎంపిక చేసిన ప్రశ్నలను


పరిష్కరించాను. కానీ, ప్రధానంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపైనే దృష్టిపెట్టా’’.  * జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు కోసం క్లిక్‌ చేయండి ఎక్కువ సమయం చదువే.. గ్రూప్‌ స్టడీ మేలు


చేసింది..  ‘‘నేను రోజకు ఇన్ని గంటలే చదవాలనే నియమాన్ని పెట్టుకోలేదు. ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని పూర్తి చేసేదానిపైనే నా సమయం ఆధారపడి ఉండేది. సాధారణంగా నేను ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తాను.


ఏదైనా ప్రశ్నను పరిష్కరించడంలో ఇబ్బందిగా అనిపిస్తే.. కాస్త బ్రేక్‌ తీసుకొనేవాడిని. అప్పుడు నా చెల్లెలితో కాసేపు మాట్లాడితే నా మూడ్‌ మారేది. ఆ తర్వాత మళ్లీ ప్రిపరేషన్‌ పునఃప్రారంభించేవాడిని.  


భయాందోళనలు నా దరి చేరనివ్వలేదు.  ఫ్రెండ్స్‌తో కలిసి గ్రూప్‌ స్టడీ చేయడం వల్ల ఒకరికొకరం సహకరించుకోవడం కూడా నా ప్రిపరేషన్‌కు దోహదపడింది’’ అని రజిత్ గుప్తా వివరించాడు. రజిత్‌ గుప్తా తండ్రి


దీపక్‌ గుప్తా కోటాలోని బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంజినీర్‌ కాగా.. తల్లి రష్మీ గుప్తా బీడీజే కళాశాలలో హోం సైన్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  Published : 02 Jun 2025 18:50 IST గమనిక:


_ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త


వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._